calender_icon.png 8 November, 2025 | 12:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కందనూలులో మరో గంజాయి ముఠా అరెస్ట్.

07-11-2025 10:17:00 PM

- ఓ వెంచర్లో విక్రయిస్తూ 5మంది అరెస్ట్ ఓ మైనర్ బాలుడు సైతం

- 138 గ్రాముల ఎండు గంజాయి, 2 సెల్ ఫోన్లు, ఓ బైక్ స్వాదీనం

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలో గంజాయి బహిరంగ విక్రయాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. గత నెల 26న నాగర్ కర్నూల్ పట్టణ నడిబొడ్డున ఉన్న ఓ లాడ్జిలో ఎండు గంజాయి విక్రాయిస్తూ 8 మంది యువకులు పోలీసులకు పట్టుబడిన విషయం తీసిందే. అది మరువకండి ముందే శుక్రవారం తెలకపల్లి మండల కేంద్రంలోని ప్రైవేట్ వెంచర్ లో కొంతమంది యువకులు గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు ఖచ్చితమైన సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి 138 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు మీడియా ముందు వెల్లడించారు.  హైదరాబాద్ లోని దూల్పేట ప్రాంతానికి చెందిన ఆకాష్ సింగ్ అనే వ్యక్తి నుండి నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఈదమ్మ గుడి కాలనీకి చెందిన బొందల రేణు కుమార్ అనే వ్యక్తి సుమారు కిలో ఎండు గంజాయిని కొనుగోలు చేయగా జిల్లా కేంద్రంలోని లాడ్జి కేంద్రంగా విక్రయాలు జరిపాడు ఆ ఘటనలో 8 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించగా బొందల రేణు కుమార్ సోదరుడు గణేష్ అనే వ్యక్తి నుంచి తెలకపల్లి మండలం వట్టిపల్లి గ్రామానికి చెందిన నారాయణ, తెలకపల్లికి చెందిన చరణ్, అఖిల్ అనే వ్యక్తులతో పాటు మరో మైనర్ బాలుడు గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించారు.

పక్క సమాచారంతో దాడులు జరపగా వారి వద్ద ఉన్న 138 గ్రాముల ఎండు గంజాయిని, ఒక ద్విచక్ర వాహనం రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ప్రాంత వ్యక్తి నుండి కిలో గంజాయి కొనుగోలు చేయగా ఈనెల 26న 735 గ్రాములు స్వాధీనం చేసుకోగా మరో 138 గ్రాములు శుక్రవారం  స్వాధీనం చేసుకున్నారు.  మరో 127 గ్రాముల గంజాయి ఎవరెవరికి విక్రయించారన్న అంశంలో లోతైన విచారణ జరగాల్సి ఉంది. గంజాయి  సేవించేవారిలో మైనర్ బాలుడు కూడా ఉండడంతో ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోందని చెప్తున్నారు. అరెస్టు చేసిన వారిని రిమాండ్ కు తరలించి మరింత లోతైన విచారణ జరుగుతున్నట్లు డి.ఎస్.పి తెలిపారు వారి వెంట సీఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ నరేష్, పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు.