08-11-2025 09:47:19 AM
డివైడర్ను ఢీ కొట్టి దగ్ధమైన కారు.
చిట్యాల,(విజయక్రాంతి): నల్గొండ జిల్లా(Nalgonda district) చిట్యాల మండలం గుండ్రాoపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారి 65 పై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో ఇన్నోవా కారు పూర్తిగా దగ్ధమై కాలిపోయిన ఘటన చోటుచేసుకుంది. ఈ కారులో ఉన్న 8 మంది సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాదు నుంచి విజయవాడకు బయలుదేరిన ఇన్నోవా కారు తెల్లవారుజామున గుండ్రా oపల్లి వద్ద డివైడర్ను ఢీ కొట్టి బోల్తా కొట్టి రోడ్డుపై పడి భారీగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
కారులో 8 మంది ఉండగా హైవేపై వస్తున్న లారీలు పక్కన ఆపి ముగ్గురు రామకృష్ణ, అశోక్, షరీఫ్ లు ఇన్నోవా కార్ డోర్లు తీసి ప్రయాణికులను బయటకు తీసి కాపాడారు. ఇందులో ఒకరు అయ్యప్ప మాల ధరించి ఉన్నాడు. తోటి వారి ప్రాణాలు కాపాడాలని అయ్యప్పమాలలో ఉండి వారిని కాపాడి దైవంగా నిలిచాడు. వీరికి తీవ్ర గాయాలయ్యాయి. కాళ్లు చేతులు కాలుతున్న లెక్కచేయకుండా 8 మంది ప్రాణాలు కాపాడడంతో రియల్ హీరోలుగా నిలిచారు. వీరిని ముందుగా చౌటుప్పల్ హాస్పిటల్ కు అక్కడినుండి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.