07-06-2025 12:00:00 AM
తప్పిన ప్రాణ నష్టం
శేరిలింగంపల్లి, జూన్ 6: మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై వెళ్తున్న కారులో శుక్రవారం మంటలు చెలరేగాయి. కేబుల్ బ్రిడ్జి మీద నుంచి వెళ్తున్న కారు ముందు భాగంలో ఇంజిన్ నుంచి మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు వెంటనే బయటికి దూకడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో కేబుల్ బ్రిడ్జిపై ట్రాఫిక్ జామ్ అయింది. మాదాపూర్ పోలీసులు, అగ్నిమాపకసిబ్బంది సంఘ టన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసి ట్రాఫిక్ క్లియర్ చేశారు.