06-06-2025 11:52:49 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాద ఘటనలో మహబూబాబాద్ జిల్లా చిన్న కృష్ణాపురం గ్రామానికి చెందిన జాటోత్ రాజశేఖర్ బ్రెయిన్ డెడ్ కు గురికాగా అతని అవయవాలను దానం చేయడం వల్ల ఎనమిది మందికి పునర్జన్మ ప్రసాదించవచ్చని వైద్యులు, జీవన్దాన్ అవయవదాన కమిటీ సభ్యులు రాజశేఖర్ తల్లిదండ్రులు మంగ్య, విజయలకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో గత నెల 23 న రాజశేఖర్ కిడ్నీలు ఇతర అవయవాలను దానం చేశారు. రాజశేఖర్ అవయవాలను దానం చేయడం వల్ల మరో ఎనిమిది మందికి పునర్జన్మ లభించింది. ఈ క్రమంలో తల్లిదండ్రులు తమ కుమారుడు రాజశేఖర్ శిలాఫలకంతో స్మారక స్థూపాన్ని తమ వ్యవసాయ క్షేత్రంలో నిర్మించారు. కుటుంబ సభ్యులతో పాటు జీవన్ దాన్ ప్రతినిధులు హాజరై రాజశేఖర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.