11-10-2025 12:54:38 AM
హనుమకొండ తహసిల్దార్ రవీందర్ రెడ్డి
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హనుమకొండ తాసిల్దార్ రవీందర్ రెడ్డి హెచ్చరించారు. వడ్డేపల్లి గ్రామ ప్రజల ఫిర్యాదు మేరకు హనుమకొండ, వడ్డేపల్లి రెవెన్యూ పరిధిలోని బతుకమ్మ బండ ప్రభుత్వ భూమిని శుక్రవారం సందర్శించారు. మండల గిరిదావర్ దశరథ రామిరెడ్డి, గ్రామ పరిపాలన అధికారిలు సర్వేయర్ తో సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ భూములను అక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎవరిని ఉపేక్షించేది లేదని అన్నారు.