02-12-2025 07:45:48 PM
రేగోడు ఎస్ఐ పోచయ్య..
రేగోడు: అక్రమంగా మద్యం అమ్మకాలు జరిపితే కేసులు తప్పవని ఎస్ఐ పోచయ్య అన్నారు. మంగళవారం మండలంలోని వెంకటాపురం గ్రామంలో వీరభద్ర హోటల్ పై పోలీసులు రైడింగ్ చేసి మద్యంను స్వాధీనం చేసుకొని వీరభద్ర హోటల్ యజమానిపై కేసు నమోదు చేశారు. సుమారు మద్యం విలువ 3750 ఉంటుందని ఎస్ఐ పోచయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమంగా మద్యం అమ్మకాలు జరిపిన కానీ మద్యం అక్రమంగా తీసుకెళ్తున్నట్టు పోలీసుల కంటబడితే కేసులు తప్పవని హెచ్చరించారు.