14-06-2025 11:25:17 PM
యాచారం సిఐ నందీశ్వర్ రెడ్డి...
యాచారం: రైతులకు కల్తీ విత్తనాలు అమ్మితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సిఐ నందీశ్వర్ రెడ్డి(CI Nandeshwar Reddy) హెచ్చరించారు. శనివారం యాచారం మండల కేంద్రంలో ఫర్టిలైజర్ షాపులో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నందీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... కల్తీ విత్తనాలతో రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విడి విత్తనాలు కొనేముందు నాణ్యతను పరిశీలించాలని సూచించారు. విడి విత్తనాలు అస్సలు కొనుగోలు చేయొద్దన్నారు. కల్తీ విత్తనాల కట్టడిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఎక్కడైనా కల్తీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. ఒకవేళ నకిలీ విత్తనాల అమ్మినట్లు త దృష్టికి వొస్తే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.