14-06-2025 11:23:18 PM
సీనియర్ సివిల్ జడ్జి దశరథ రామయ్య..
చేవెళ్ల: జాతీయ న్యాయ సంస్థ అదేశాల మేరకు చేవెళ్ల కోర్టులో జూన్ 9 నుంచి 14 వరకు నిర్వహించిన లోక్ అదాలత్(Lok Adalat)లో లోక్ అదాలత్ లో 1,271లో పరిష్కరించి.. రూ. 16, 62,690 జరిమానా విధించామని సీనియర్ సివిల్ న్యాయ మూర్తి దశరథ రామయ్య(Senior Civil Judge Dasharatha Ramaiah) తెలిపారు. శనివారం కోర్టు హాల్లో ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు రోజుల పాటు నిర్వహించిన లోక్ అదాలత్ లో 214 ఈ పెట్టీ కేసులకు రూ. 2,140, 287 క్రైమ్ కేసులకు రూ.2,87,500, 766 డ్రంకెన్ డ్రైవ్ కేసులకు రూ.13,73,000 జరిమానా విధించి పరిష్కరించామని తెలిపారు.
వీటితో పాటు నాలుగు సివిల్(ఓఎస్) కేసులను కూడా సాల్వ్ చేశామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి జె. శ్యామ్ కుమార్, స్పెషల్ రిటైర్డ్ జడ్జి కే. లక్ష్మన్, సీఐ భూపాల్ శ్రీధర్, బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్లు జీ. కృష్ణ గౌడ్, యం. నర్సింలు, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ తలారి ప్రకాశం, శివరాజ్ గౌడ్, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ కే .కుమార్, సీనియర్ న్యాయవాదులు బాల స్వామి, ఉపేందర్ రెడ్డి, జి. చంద్ర శేఖర్, జి. మహేష్ కుమార్, న్యాయవాదులు ముక్తార్ షరీఫ్, మల్లేష్ గౌడ్, అమరేందర్ రెడ్డి, బి. ఆనంద్, ప్రవీణ, లోకేశ్వరి దేవి, సీనియర్ సూపరిడెంట్లు మహిపాల్, కృష్ణవేణి, కోర్టు సిబ్బంది అనిల్ కుమార్, నర్సింలు, ఆనంద్ కుమార్ , పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.