05-06-2025 12:02:39 AM
తుంగతుర్తి వ్యవసాయ సంచాలకులు రమేష్ బాబు
తుంగతుర్తి జూన్ 4: గ్రామాల్లోని రైతులకు ఎరవేసి నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై కేసులు నమోదు చేస్తామని తుంగతుర్తి వ్యవసాయ సంచాలకులు రమేష్ బాబు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టి మాట్లాడారు. గతంలో జోగులాంబ నాగర్ కర్నూల్ లో పనిచేసినట్టు తెలిపారు. గ్రామాల్లోని రైతులు నకిలీ పత్తి విత్తనాలకు తక్కువ ధర వస్తుందని కొనుగోలు చేసి మోసపోవద్దని అన్నారు.
గ్రామాల్లో ప్రభుత్వ రిజిస్టర్ అయిన షాపుల్లోనే కొనుగోలు చేసి రసీదును పొందాలని సూచించారు. అనంతరం మండల పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్ సంఘ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి బాలకృష్ణ పాల్గొన్నారు.