15-06-2025 08:32:17 PM
పదివేల నగదు బహుమతిని అందించిన హెడ్ కానిస్టేబుల్ దంపతులు..
పెన్ పహాడ్: పదవ తరగతిలో ఓ విద్యార్థిని ఉత్తమ ప్రతిభ కనబరిచిన సందర్భంగా గ్రామానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ దంపతులు రూ.10 వేలు నగదు ప్రోత్సాహకం అందించి ఉన్నతంగా చదువుకోవాలని ప్రోత్సహించారు. వివరాల్లోకెళ్తే.. మండల పరిధిలోని దూపహడ్ గ్రామానికి బొల్లెపల్లి మల్లిఖార్జున్- మమత దంపతుల కుమార్తె బొల్లెపల్లి నిఖిల గ్రామం నుండి గరిడేపల్లి మండలం గడ్డిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకొని ఉత్తమ ప్రతిభ కనపరిచినందుకు గాను సూర్యాపేటలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న గ్రామానికి చెందిన బోయిళ్ళ అరవిందు-శ్యామల దంపతులు పదివేల రూపాయల నగదు ప్రోత్సాహంగా అందించారు.
ఈ సందర్భంగా దాత అరవింద్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివి గ్రామంలో ఎక్కువ మార్కులు సంపాదించిన వారికి ఈ బహుమతిని అందిస్తామని తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులు బాగా చదివి ఉన్నతంగా ఎదగాలని గ్రామానికి వారి తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఉద్యోగస్తులు, విద్యావేత్తలు, యువతి, యువకులు, మహిళలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.