calender_icon.png 15 June, 2025 | 2:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీళ్లే ఆ ఉగ్రవాదులు

09-05-2024 01:04:07 AM

ఐఏఎఫ్ కాన్వాయ్‌పై దాడి ఘటనలో పురోగతి

ముగ్గురు ఉగ్రవాదుల ఫొటోలు విడుదల

శ్రీనగర్, మే 8: ఇటీవల భారత వాయుసేనపై వరుస దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. దాడి సందర్భంగా సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. గత వారంలో జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఐఏఎఫ్ జవాన్లపై టెర్రరిస్టులు తుపాకులతో దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో ఏకే ఎం4ఎస్ తుపాకులను వినియోగించారు. ఈ దాడిలో విక్కి పాండే మృత్యువాత పడగా, నలుగురు జవాన్లు గాయపడ్డారు. దాడికి పాల్పడిన వారిలో పాకిస్థాన్ ఆర్మీ కమాండో ఇలియాస్, లష్కరే తోయిబాకు చెందిన అబు హమాజ్, మరో పాకిస్థాన్ టెర్రరిస్టు ఉన్నట్టు గుర్తించారు. వీరికి సంబంధించిన ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల నజరానా ప్రకటించారు.