09-05-2024 01:00:57 AM
మే 14 వరకు కస్టడీ విధింపు
బెంగళూరు, మే 8: కిడ్నాప్, అత్యాచారం కేసులో కర్ణాటక ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణను బెంగళూరు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. తొలు త ౩ రోజుల పాటు పోలీస్ కస్టడీ విధించగా, తాజాగా కస్టడీ ముగిసింది. దీం తో మే 14 వరకు రేవణ్ణను జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. రేవణ్ణ కుమారుడు, ప్రజ్వల్ రేవణ్ణకు చెందిన అశ్లీలవీడియోలు వెలుగులోకి రావడం కలకలం రేపింది. 400 మంది మహిళలపై అత్యాచారం చేసినట్టు చెబుతు న్నారు. ఈ వ్యవహారంపై కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన వెంట నే ప్రజ్వల్ జర్మనీ వెళ్లాడు. హెడీ రేవణ్ణ కూడా పలువురు మహిళలపై అత్యాచారం చేసేవారని ఓ మహిళ ఫిర్యాదు మేరకు ఆయనను అరెస్టు చేశారు.