calender_icon.png 15 June, 2025 | 11:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లలా ఉంటారు

09-05-2024 01:09:01 AM

ఈశాన్యంలో చైనా  పోలికలు కనిపిస్తాయి

సామ్ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు

తీవ్రంగా వ్యతిరేకించిన బీజేపీ నేతలు

న్యూఢిల్లీ, మే 8: కాంగ్రెస్ ప్రవాసీ నేత సామ్ పిట్రోడా వ్యాఖ్యలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నాయి. కొన్ని రోజుల ముందు వారసత్వపు పన్ను గురించి మాట్లాడి ఎన్నికల వేళ వివాదాన్ని రేకెత్తించారు. తాజాగా మరో రాజకీయ దుమారానికి కారణమయ్యారు. తాజాగా భారత్‌లో విభిన్న జాతులకు సంబంధించిన సమాజాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారాయి.అమెరికాకు చెందిన స్టేట్స్‌మన్ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ.. మనం భారతదేశంలో విభిన్నమైన అంశాలను కలిగి ఉన్నాం. భారత్‌లో తూర్పున ఉండే ప్రజలు చైనీస్ పోలికలతో ఉంటారు. పశ్చిమాన అరబ్‌లా కనిపిస్తారు. ఉత్తరాదిన ఆంగ్లేయుల తరహాలో తెల్లగా ఉంటారు. దక్షిణాది వారు ఆఫ్రికన్ల వలె ఉంటారు అని వ్యాఖ్యానించారు.  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా భావించే పిట్రోడా ఇలాంటి వ్యాఖ్యలు చేయ   డం ఆ పార్టీకి తీవ్రనష్టం కలిగించేలా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

మండిపడ్డ బీజేపీ...

పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ పాలిత ఈశాన్య రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించాయి. తమ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ అసోం, మణిపుర్ ప్రభుత్వా లు డిమాండ్ చేశాయి. దేశాన్ని మతపరంగా విభజించాలని కాంగ్రెస్ భావిస్తోందని మణిపుర్ సీఎం బీరేన్‌సింగ్ ఆరోపించారు. ఇది కాంగ్రెస్ రహస్య అజెండా అంటూ మండిపడ్డారు. ప్రధాని మోదీ స్పందిస్తూ పిట్రోడా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాహుల్‌గాంధీని ప్రస్తావిస్తూ ఇలాంటి అవమా నకర, జాత్యాహంకార వ్యాఖ్యలను భారత్ ఎప్పుడూ సహించదని పేర్కొన్నారు. వర్ణ, జాతి ఆధారంగా ప్రజలను విభజించడంపై తనకు ఎంతో కోపంగా ఉందని చెప్పారు.

మాకు సంబంధం లేదు

దేశ వైవిధ్యత విషయంలో సామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు తప్పు. అంగీకారయోగ్యం కాదు. ఆయన అభిప్రాయాలకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు.’  జైరాం రమేశ్, కాంగ్రెస్ నేత

సామ్ భాయ్ నేర్చుకోండి

సామ్ భాయ్.. నేను ఈశాన్య రాష్ట్రానికి చెందిన వాడిని. మేం వేరుగా కనిపించవచ్చు. కానీ మనమంతా ఒకటే. మన దేశానికి సంబంధించి కొంచెమైనా నేర్చుకోండి.   బిశ్వ శర్మ, అస్సాం సీఎం

సిగ్గుచేటు

రాహుల్ గాంధీకి సా మ్ పిట్రోడా మెంటార్. భారతీయులపై ఆయన వివక్షాపూరిత, విభజనా త్మక వ్యాఖ్యలు చూడండి. వారి సిద్ధాంతమే విభజించు, పాలించు అన్నట్టు ఉంటుంది.  కంగనా రనౌత్, సినీనటి