25-06-2025 07:45:21 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం, ఇనుగుర్తి అలాలోని వివిధ గ్రామాల అంగన్వాడీ కేంద్రాలను బుధవారం సిడిపిఓ శిరీష(CDPO Sirisha) తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మెనూ ఖచ్చితంగా అమలు చేయాలని, గర్భిణీ, బాలింతలు కచ్చితంగా అంగన్వాడీ కేంద్రాల్లోనే ప్రతిరోజు భోజనం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ప్రీస్కూల్ పిల్లల హాజరు శాతం పెంచాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ దుర్గ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.