28-06-2025 12:37:27 AM
డాక్టర్ కోట నీలిమ
సనత్ నగర్, జూన్ 27 (విజయ క్రాంతి) : బేగంపేట్ డివిజన్ లోని ఓలడ్స్ కస్టమ్స్ బస్తీలో గల ఎకరం 20 గుంటల ప్రభుత్వ స్థలాన్ని ముస్లిం స్మశాన వాటికకు కేటాయించాలని పీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి అధికారులను కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, ముస్లిం నాయకులతో కలిసి స్థలాన్ని సందర్శించారు. అక్కడ రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఆమె మాట్లాడుతూ.. స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం యంత్రాంగం ఆలో చించాలన్నారు. స్థల వివాదం కోర్టు పరిధిలో ఉందని చెప్పి తప్పించుకు తిరగకుండా స్థల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.
స్థల వివాదం నేపథ్యంలో ఇక్కడ ఈ మధ్య మృతి చెందిన పది మందికి డెత్ సర్టిఫికెట్స్ కూడా రాలేదని.. వీలైనంత త్వరగా ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.