28-06-2025 12:37:24 AM
నిజామాబాద్, జూన్ 27 (విజయ క్రాంతి): వర్షాకాలం తోపాటు చలికాలంలో విధుల నిర్వహణ కష్టం అవుతదన్న ముందు జాగ్రత్తలో భాగంగా నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, నిజామాబాదులోని 369 మంది హోంగారడ్స్ కు వులెన్ జాకెట్స్ ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ వర్షాకాలం, చలి కాలం సమీపిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరు ఈ వులెన్ జాకెట్స్ ను సద్వినియోగం చేసుకోవాలని విధినిర్వహణలో కూడా క్యారీ చేసి అవసర నిమిత్తం ఉపయోగించుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా హోంగారడ్స్ విభాగం ఇన్చార్జ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీ సతీష్ , వెల్ఫేర్ విభాగం రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.