ఎల్ఐసిలో వాటాల విక్రయానికి కేంద్ర కసరత్తు
న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (Life Insurance Corporation)లో మరిన్ని వాటాల అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది, ఈ లావాదేవీకి సంబంధించిన వివరాలను పెట్టుబడుల ఉపసంహరణ విభాగం రూపొందిస్తుందని వర్గాలు తెలిపాయి. మే 2022లో ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (Initial Public Offering) ద్వారా 3.5 శాతం వాటాను షేరుకు రూ.902-949 ధరల శ్రేణికి విక్రయించిన ఎల్ఐసీలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి 96.5 శాతం వాటా ఉంది. ఈ వాటా అమ్మకం ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.21,000 కోట్లు సమకూరింది.
ఎల్ఐసీలో ఓఎఫ్ఎస్ (OFS) మార్గం ద్వారా తదుపరి వాటా విక్రయానికి ప్రభుత్వం ఆమోదం తెలిపాడంతో చర్చలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. మార్కెట్ పరిస్థితిని పరిశీలించి వాటా అమ్మకాన్ని ముగించడం పెట్టుబడుల ఉపసంహరణ శాఖ బాధ్యత. 2027 మే 16 నాటికి తప్పనిసరి 10 శాతం పబ్లిక్ షేర్ హోల్డింగ్ అవసరాన్ని తీర్చడానికి ప్రభుత్వం ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థలో మరో 6.5 శాతం వాటాను తగ్గించుకోవాలి. LIC ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 5.85 లక్షల కోట్లు ఉండగా, బిఎస్ఇలో ఎల్ఐసి షేర్లు మునుపటి ముగింపుతో పోలిస్తే 2.27 శాతం తగ్గి రూ.924.40 వద్ద ట్రేడవుతున్నాయి.






