11-07-2025 01:13:41 AM
బీసీలకు 42% రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు
- ఆర్డినెన్స్ ద్వారా 2018 పంచాయతీ చట్టం సవరణ
- రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం
- కొత్తగా 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్పై చర్చ
- రాష్ట్రంలో రెండు యూనివర్సిటీల ఏర్పాటుకు ఆమోదం
- గోశాలల నిర్వహణపై ప్రత్యేక పాలసీ
- రాష్ట్ర మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
ఇవీ నిర్ణయాలు..
- రాష్ర్టంలో కొత్తగా రెండు ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఎమిటీ యూనివర్సిటీ, సెయింట్ మేరీ రిహాబిలిటేషన్ యూనివర్సిటీలకు క్యాబినెట్ ఆమో దం తెలిపింది. యూనివర్సిటీలలో మన తెలంగాణ విద్యార్థులకు, అంటే మన స్థానిక విద్యార్థులకు 50% అడ్మిషన్లకు అవకాశం కల్పించాలనే నిబంధ నను ప్రభుత్వం విధించింది.
- సంగారెడ్డి జిల్లాలో ఇటీవల కొత్తగా ఏర్పడ్డ జిన్నారం, ఇంద్రీశం మున్సిపాలిటీల పరిధిలో చేర్చే 18 గ్రామ పంచాయతీలను డీ లిస్టింగ్ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
- రాష్ర్టంలో అధునాతనంగా గోశాలల ఏర్పాటు, నిర్వహణపై ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి నేతృత్వంలో ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. వచ్చే క్యాబినెట్ సమావేశంలోపు కమిటీ తమ నివేదికను అందించాలని గడువు నిర్ణయించింది. ఇప్పటికే సీఎం ఆదేశాల మేరకు పశుసంవర్థక శాఖ రూపొ ందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను, కొత్తగా నిర్మించే గోశాల డిజైన్ల ను మంత్రివర్గ భేటీలో ప్రదర్శించారు. రాష్ర్టంలో 306 గోశాలలున్నా యి. హైదరాబాద్లోని ఎన్కేపల్లి, వెటర్నరీ యూనివర్సిటీ, వేములవాడ, యాదగిరిగుట్టలో అత్యాధునికంగా గోశాలలు నిర్మించాలని నిర్ణయించారు. రాష్ర్టం లో ఉన్న గోశాలల రిజిస్ట్రేషన్లు, వాటి నిర్వహణపై సమగ్ర విధానపత్రం రూపొందించాలని నిర్ణయించారు.
- రాష్ర్టంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ ను వేగవంతం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. భూసేకరణ పూర్తిచేసి ప్రాజెక్టులను కూడా నిర్మించి రాష్ట్ర ప్రజలకు సాగునీటిని అందించాలని సర్కారు నిర్ణయం తీసుకున్నది.
25న మరోసారి క్యాబినెట్ భేటీ
-ప్రతీ మూడు నెలలకోసారి క్యాబినెట్ నిర్ణయాలపై చర్చ
-బీసీ రిజర్వేషన్లకు న్యాయపరంగా చిక్కులు రాకుండా ఆర్డినెన్స్
-రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడి
-మార్చి నాటికి లక్ష ఉద్యోగాలు: మంత్రి పొన్నం ప్రభాకర్
-82 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేస్తాం: మంత్రి వాకిటి శ్రీహరి
హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాలకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో సగం జనాభా ఉన్న బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి, ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు రిజర్వేషన్లు కల్పించి.. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్ష తన గురువారం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం దాదాపు నాలుగు గంటలు జరిగింది.
ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు సర్పంచ్, ఎంపీటీసీలకు మండల యూనిట్గా, జడ్పీటీసీలకు జిల్లా యూనిట్గా, జడ్పీ చైర్మన్లకు రాష్ట్రం యూనిట్గా తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా, మార్చి నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను ప్రభుత్వం ఆమోదించగా, విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో నూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో ప్రాతినిధ్యం కల్పించే రెండు బిల్లులను అదే రోజు అసెంబ్లీ ఆమోదించింది. ఇటీవలే పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశంపై హైకోర్టు కూడా నెలాఖరులోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించడంతో.. వీటన్నింటినీ చర్చించిన మంత్రివర్గం, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం బీసీలకు ఆర్డినెన్స్ తీసుకొచ్చి రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంది.
సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా రాష్ర్ట ప్రభుత్వం ఇప్పటికే బీసీ డెడికేటేడ్ కమిషన్ను నియమించింది. రాష్ర్ట ప్రణాళిక విభాగం అధ్వర్యంలో కులగణన చేపట్టింది. వీటి ఆధారంగానే అసెంబ్లీలో 42 శాతం రిజర్వేషన్ల బిల్లులకు ఆమో దం పొందింది. అందుబాటులో ఉన్న ఎంపిరికల్ డేటా ఆధారంగా, జనాభా ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు తదుపరి చర్యలు చేపట్టాలని తీర్మానించింది.
కొత్తగా 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్..
ఈ ఏడాదిన్నర వ్యవధిలో రాష్ర్ట ప్రభుత్వం 60 వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. వీటితో పా టు మరో 17, 084 ఉద్యోగాల నియామక ప్రక్రి య వివిధ దశల్లో ఉంది. కొత్తగా 22, 033 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్లు ఇచ్చే విషయాన్ని మంత్రివర్గం చర్చించింది. వివిధ విభాగాల్లో ప్రతీ ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల పనితీరును సమీక్షించేందుకు వీలుగా వారి ఆధార్, పూర్తి వివరాలు సేకరించాలని ఆర్థిక శాఖను మంత్రివర్గం ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగుల హాజరుతో పాటు విధినిర్వహణలో జవాబుదారీతనం పెం చేందుకు అవసరమైన సంస్కరణలు తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించి నియమించిన అధికారుల కమిటీకి ఈ బాధ్యత అప్పగించా లని నిర్ణయించారు.
కొత్త సంప్రదాయం..
రాష్ర్ట మంత్రివర్గం కేబినేట్ భేటీలకు సంబంధించి ఈసారి కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు జరిగిన కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, అమలుపై సమీక్ష జరిపింది. 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటివరకు 18 కేబినెట్ సమావేశాలు జరిగాయి. గురువారం 19వ క్యాబినెట్ సమావేశం జరిగింది. గతంలో జరిగిన సమావేశాల్లో మొత్తం 327 అంశాలను చర్చించింది. వీటిలో 321 అంశాలను కేబినేట్ ఆమోదించింది. వీటి అమలు పురోగతిని శాఖలవారీగా అధికారులతో మంత్రివర్గం చర్చించింది.