13 July, 2026 | 8:15 PM

Breaking News

భూముల రీ సర్వేతో భవిష్యత్తులో వివాదాలు ఉండవు   •   జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా కోదాడ వాసి సాయిశర్మ   •   నూలు పురుగుల నివారణకై మాత్రలు పంపిణీ చేసిన చైర్మన్ రాధాకృష్ణ   •   జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి   •   బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టు   •   శ్రీ సోమలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   మంథని అభివృద్ధిలో మరో ముందడుగు   •   నాచారం ఈఎస్ఐ ఆస్పత్రి వద్ద నర్సింగ్ అభ్యర్థుల ధర్నా మద్దతు తెలిపిన ఆర్. కృష్ణయ్య డిమాండ్   •   చిన్నారుల ఆరోగ్యానికి నులిపురుగుల నివారణే రక్ష   •   రాజన్న ఆలయాభివృద్ధికి అమెరికా ప్రవాస కుటుంబం చేయూత   •  

హెవీ డ్రైవర్ యూనియన్ సభ్యులతో సీజీఆర్ సమావేశం

09-10-2025 09:50 AM

గుమ్మడిదల: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీలోని సిజిఆర్ కార్యాలయంలో గుమ్మడిదల మండల హెవీ డ్రైవర్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి యూనియన్ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... హెవీ డ్రైవర్ యూనియన్ సభ్యుల సమస్యలను త్వరలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాను. సభ్యులందరికీ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించేందుకు సిజిఆర్ ట్రస్ట్ తరఫున సహాయం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు బక్క సత్యనారాయణ, ఉపాధ్యక్షులు పి. యాదగిరి, సెక్రటరీ శంకర్ యాదవ్, కోశాధికారి నీరుడి ప్రవీణ్ కుమార్, కమిటీ సభ్యులు మల్లేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.