calender_icon.png 20 February, 2026 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్

20-02-2026 12:10:51 AM

  1. నిందితుల్లో ఒకరు మహిళ
  2. సొత్తు స్వాధీనం

జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలు సాఫ్ట్వేర్ ఇంజినీర్ మెడలో నుంచి గొలుసు ఎత్తుకెళ్లిన కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ నేరానికి పాల్పడిన కాకినాడకు చెందిన చెశెట్టి రేవతి (33), గుంటూరుకు చెందిన రాపిడో డ్రైవర్ గిద్దల నరేంద్ర అలియాస్ నాని (23)లను అరెస్ట్ చేసినట్లు జుబ్లీహిల్స్ ఎస్హెచ్‌ఓ యు.శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు.

ఈ నెల 17న ఉదయం కడపకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ కడపాల మానస రోడ్ నంబర్ 39లోని తన కార్యాలయానికి నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసు కుంది. రోడ్ నంబర్ 44 వద్ద ద్విచక్ర వాహనంపై వచ్చిన నిందితులు ఆమెను వెంబడిం చారు. నరేంద్ర వాహనాన్ని నడుపుతుండగా వెనుక కూర్చున్న రేవతి మహిళ మెడలోని 10 గ్రాముల బంగారు గొలుసును తెంచుకొని బండిపై ఇద్దరూ పరార య్యారు.

బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సిసిటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు తులం బంగా రు గొలుసు, నేరానికి ఉపయోగించిన స్కూటర్ రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్నారు. నిందితులు ప్రస్తుతం సనత్ నగర్లోని హిందూ పబ్లిక్ స్కూల్ సమీపంలో నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.