18-06-2025 01:43:52 PM
మంథని,(విజయక్రాంతి): ధర్మారం లో దొంగలు బాబోయ్... దొంగలు బీభత్సం సృష్టించారు. బుధవారం తెల్లవారు జామున మండలంలోని ధర్మారం (గద్దలపల్లి) గ్రామంలో కందుకూరి లక్ష్మి బాయ్ (60) ఇంట్లో నిద్రిస్తుండగా రాత్రి తెల్లవారుజామున 3 గంటల సమయంలో దొంగలు ఆమె మెడలో నుంచి రెండు తులాలన్నారా బంగారాన్ని(Chain snatching) దొంగలు లాక్కొని పారిపోయారు. లక్ష్మీబాయికి ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు ఉండగా, రెండు సంవత్సరాల క్రితం కుమారుడు మరణించాడు. ఆమె చిన్న కూతురుతో ఇంట్లో నివసిస్తుంది. ఇటీవల చిన్న కూతురు బంధువుల ఇంటికి వెళ్ళింది. ఈ సంఘటనతో గద్దలపల్లి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.మంథని పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.