18-06-2025 01:52:16 PM
నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వ ఉత్తర్వులు.
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): కందనూలు జూనియర్ కళాశాలకు కొత్త శకం రాబోతుంది. శిథిలావస్థలో ఉన్న పూర్వపు కళాశాల భవనాన్ని పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.9 కోట్ల నిధులు విడుదల చేస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం(Telangana State) సాధించుకున్న తర్వాత కూడా విద్యారంగానికి గత ప్రభుత్వం సముచిత స్థానం కల్పించకపోవడంతో జూనియర్ కళాశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అధికారంలోకి ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు సమూచిత స్థానం కల్పిస్తోందని చెబుతున్నారు. ఇందులో భాగంగానే సంబంధిత అధికారులచే కళాశాల భవన నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం 9 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు.