calender_icon.png 18 June, 2025 | 5:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గూగుల్ ఇన్నోవేటివ్ కంపెనీ.. మాది ఇన్నోవేటివ్ ప్రభుత్వం

18-06-2025 01:38:06 PM

  1. గూగుల్‌ సేఫ్టీ ఇంజినీరింగ్‌ సెంటర్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి.
  2. మన జీవితాలన్నీ డిజిటల్‌గా మారాయి. 
  3. మన ఎకానమీ.. గవర్నమెంట్ అన్ని డిజిటల్ అయ్యాయి.
  4. డిజిటల్‌గా సెక్యూర్‌గా ఉండాల్సిన అవసరం ఉంది.
  5. జీఎస్ఈసీ హైదరాబాద్లో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది:సీఎం రేవంత్‌

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్‌ను(Google Safety Engineering Center) ప్రారంభించారు. గూగుల్ సెఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) పాల్గొన్నారు. ఐటీ రంగంలో వేల సంఖ్యలో ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు రానున్నాయి. గూగుల్ సెఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ పనితీరును సిబ్బంది సీఎంకు వివరించారు. ఏషియా పసిఫిక్ రీజియన్ లో రెండో గూగుల్ సెఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్. ప్రపంచంలో నాలుగో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ హైదరాబాద్ లో ప్రారంభం అయింది.

ఏషియా పసిఫిక్ రీజియన్(Asia Pacific Region)లో సురక్షిత డిజిటల్ సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. జీఎస్ఈసీ కేంద్రాన్ని ప్రారంభిండం సంతోషంగా ఉందని సీఎం తెలిపారు. డిజిటల్ సమాచారం భద్రంగా ఉంటే క్షేమంగా ఉన్నట్లేనని పేర్కొన్నారు. డిజిటల్ భద్రత(Digital security) జీఎస్ఈసీ ప్రధాన లక్ష్యం అన్నారు. గూగుల్ ఇన్నోవేటివ్ కంపెనీ.. మాది ఇన్నోవేటివ్ ప్రభుత్వమని తెలిపారు. నైపుణ్యాలు పెంచేందుకు స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. ఉత్తమ పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారిందని చెప్పారు. 2035లో పు 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణ మారాలని ఆకాంక్షించారు. 2047 లోపు 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణ మారాలన్నారు. తెలంగాణ రైజింగ్(Telangana Rising)లో భాగంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మారుస్తున్నామని తెలిపారు. తెలంగాణ మహిళలు ధనిక పెట్టుబడిదారులకు పోటీదారులుగా మారుతున్నారని స్పష్టం చేశారు. ప్రభుత్వంలో నూతన ఆవిష్కరణలు, విధానాలు తీసుకుకొచ్చామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.