26-08-2025 06:27:05 PM
బోథ్ గ్రంథాలయాన్ని సందర్శించిన చైర్మన్ నర్సయ్య
బోథ్,(విజయక్రాంతి): జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి తనవంతుగా ప్రత్యేక కృషి చేస్తానని ఇటీవల గ్రంథాలయ నూతన చైర్మన్ గా నియమితులైన మల్లెపూల నర్సయ్య పేర్కొన్నారు. బోథ్ మండల కేంద్రంలోని పురాతన గ్రంథాలయానికి రూ.50 లక్షల నిధులు మంజూరు చేసి దాని అభివృద్ధికి కృషి చేస్తానని చైర్మన్ వెల్లడించారు. మంగళవారం బోథ్ గ్రంథాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. గ్రంధాలయంలో ఉన్న బుక్స్ ను, వార పత్రికలు, వార్తా పత్రికలను పరిశీలించి, స్టాక్ రిజిస్టర్ లను పాఠకులకు గల సౌకర్యాలపై పర్యవేక్షించారు. అంతకు ముందు గ్రంథాలయ చైర్మన్ గా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా బోథ్ పట్టణానికి రావడంతో నర్సయ్య ను కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు.