26-08-2025 07:15:24 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): రేషన్ బియ్యం పంపిణీ పూర్తయినా తమకు రావాల్సిన కమీషన్ ఇవ్వలేదని, ఇప్పటికైనా ఇవ్వాలని రేషన్ డీలర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. జిల్లాలోని రేషన్ డీలర్లు మంగళవారం కలెక్టరేట్ ముట్టడికి యత్నించగా పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్స్ జిల్లా అధ్యక్షుడు నాగం సురేందర్ మాట్లాడుతూ... జిల్లాలో 577 మంది రేషన్ డీలర్లు ఉన్నారని తెలిపారు. గత 5 నెలల నుంచి ప్రభుత్వం నుంచి రావాల్సిన కమీషన్ రావడం లేదని, వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసారు. బియ్యం పంపిణీ అయిపోగానే కమీషన్ వెయ్యాలని, ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగానే ఒకే దఫాలో ఇవ్వాలన్నారు.