10-09-2025 12:55:08 PM
రజాకార్లను తరిమికొట్టిన ధీరురాలు
ప్రజాపోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన యోధురాలు
నందికొండ లో ఐలమ్మ 40 వ వర్ధంతి
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ కేంద్రంలోని తొలితరం భూపోరాట ఉద్యమ నాయకురాలు చాకలి ఐలమ్మకు రజక సంఘం అధ్యక్షుడు బూష రాజుల కృష్ణయ్య ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. చాకలి ఐలమ్మ(Chakali ilamma) వర్ధంతి ఆమె సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జ్వలించిన నిప్పుకణిక అని, తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత అని కీర్తించారు.
తెలంగాణ తెగువకు చిరునామాగా నిలిచిన వీర వనిత అని, మహిళా లోకానికి స్ఫూర్థి ప్రధాత అని చెబుతూ.. సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు తెలియజేస్తున్నామని వరంగల్ జిల్లా పాలకుర్తికి చెందిన చాకలి ఐలమ్మ అలియాస్ చిట్యాల ఐలమ్మ దొరల పెత్తనాన్ని ఎదిరించి, రజాకార్లను తరిమికొట్టి వీరవనితగా పేరు తెచ్చుకుంది.
తొలి భూపోరాటానికి నాంది పలికి, దొరలపై విజయం సాధించింది. ఆమె చరిత్ర ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెంది, ప్రజా పోరాటాలను స్పూర్తిగా నిలిచింది. ఇవాళ ఆమె 39వ వర్ధంతి వేడుకల సందర్భంగా తెలంగాణలో పలువురు నాయకులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సాగర్ రజక సంఘం నాయకులు సిహెచ్ విజయ, జంగయ్య ,వెంకన్న, పూర శ్రీనివాస్ ,వెంకటేశ్వర్లు, దుర్గయ్య, వేణు, రాము, రమేష్ జి , పగడాల నాగరాజు, మంద రఘువీర్ బిన్నీ, చంద్రమౌళి నాయక్, వల్లపు రెడ్డి ,ఎల్లయ్య యాదవ్, అలిపిరి శీను పాల్గొన్నారు.