20 June, 2026 | 3:35 PM

Breaking News

రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •   మండల ఉపసర్పంచుల ఫోరం   •  

2 గంటల నుంచి గ్రూప్ -1 పరీక్షా సమయంలో మార్పులు

17-08-2024 01:03 AM
  1. అక్టోబర్ 21 నుంచి పరీక్షలు 
  2. ప్రకటించిన టీజీపీఎస్సీ

హైదరాబాద్, ఆగస్టు 16 (విజయ క్రాంతి): గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణనుమధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మార్చినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎ స్సీ) ప్రకటించింది.ఈ మేరకు పరీక్షల సమయం లో మార్పులు చేసినట్టు టీజీపీఎస్సీ వెల్లడించింది. ఇది వరకు మధ్యాహ్నం 2:30 గంట ల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు వెబ్ నోట్ ఇచ్చామని పేర్కొంది. అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 27 వరకు హైదరాబాద్ లో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ సర్వం సిద్ధం చేస్తుంది. జూలై మొదటి వారంలో 1:50 నిష్పత్తి ప్రకారం 32 వేల మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేసింది.