calender_icon.png 8 June, 2025 | 1:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోవుల అక్రమ రవాణాపై చెక్ పోస్టులు ఏర్పాటు

04-06-2025 12:54:24 AM

ఇంచార్జి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, జూన్ 3(విజయక్రాంతి): బక్రీద్ పండుగ సందర్భంగా గోవుల అక్రమ రవాణా జరగకుండా చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని జిల్లా పోలీసులను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. గోవులను రక్షించడంలో భాగంగా పోలీస్ శాఖ వాహనాలను సీజ్ చేసినప్పుడు  గోవులను గోశాలకు తరలించినప్పుడు వాటికి ఆహారం అందించడానికి మున్సిపల్ శాఖ తరపున చర్యలు తీసుకోవాలన్నారు.

మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఈనెల 7న బక్రీద్ పండుగ సందర్భంగా పోలీస్ , పశుసంవర్ధక, రెవిన్యూ, రవాణా, మున్సిపల్ కమీషనర్లు, ముస్లిం మత పెద్దలు, వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఇన్చార్జి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. బక్రీద్ పండుగ ఏర్పాట్ల గురించి, ప్రార్థనా స్థలాల పరిశుభ్రత, గోవుల అక్రమ రవాణాను నివారించడం, బందోబస్తు నిర్వహణ ఇతర సంబంధిత అంశాల గురించి చర్చించడం జరిగింది.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మత సామరస్యానికి చిహ్నంగా బక్రీద్ పండుగ నిర్వహించుకునేలా పటిష్ట ప్రణాళికతో ముందుకు పోతున్నామన్నారు.   జిల్లా ఇంచార్జి ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తున్నామన్నారు.

సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై ప్రజల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే జిల్లాలో పోలీస్ అధికారులు దృష్టికి తీసుకురావాలని స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి వెంకటయ్య, డీఎస్పీ ప్రసన్నకుమార్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిపిఓ యాదయ్య, మున్సిపల్ కమిషనర్, పశుసంవర్ధక శాఖ సిబ్బంది, పోలీస్ యంత్రాంగం, రవాణా, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.