04-06-2025 12:52:44 AM
వీహెచ్పీ నాయకులపై దాడికి నిరసనగా బంద్
సిద్దిపేట, జూన్ 3 (విజయక్రాంతి): గో సంరక్షకులు, విశ్వహిందూ పరిషత్ నాయకులు రాజారాం, మురళిపై జరిగిన దాడిని నిరసిస్తూ వీహెచ్పీ ఆధ్వర్యంలో మంగళవారం సిద్దిపేట బంద్కు వీహెచ్పీ, పలు హిందూ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. దాడికి పాల్పడిన గోభక్షకులను వెంటనే అరెస్టు చేసి రిమాండ్కు తరలించాలని డిమాండ్ చేశారు.
సిద్దిపేటలో గోవుల ను వధించే ప్రాంతాలను గుర్తించి పోలీసులు పికెట్ ఏర్పాటు చేయాలని కోరారు. పట్టణంలో ద్విచక్ర వాహనాలపై పలు ప్రధా న వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ ర్యాలీకి మద్దతు తెలిపారు.