17 April, 2026 | 2:05 PM

Breaking News

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •   ఉద్యోగుల ప్రధాన సమస్యలపై నిరసన ప్రదర్శన   •   కామారెడ్డి జిల్లాలో ఏసీబీ సోదాలు.. అస్వస్థతకు గురైన ఎక్సైజ్ సీఐ   •  

వెజ్ బిర్యానీలో చికెన్ ముక్కలు

23-04-2025 12:47 AM

- జీహెచ్‌ఎంసీకి వినియోగదారుడి ఫిర్యాదు 

- వారం రోజుల తర్వాత షాగౌస్ హోటల్‌లో తనిఖీలు

- అధికారుల తీరుపై విస్మయం

కార్వాన్, ఏప్రిల్ 22: హోటల్‌లో వెజ్ బిర్యానీ కొని, ఇంటికి పార్సిల్ తీసుకెళ్లిన ఓ వినియోగదారుడు అవాక్కయ్యాడు. వెజ్ బిర్యానీలో చికెన్ ముక్కలు రావడంతో ఆశ్చర్యానికి గురై వెంటనే జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

సుమారు పదిరోజుల క్రితం లంగర్‌హౌస్‌కు చెందిన వ్యక్తి టోలీచౌకీలోని షాగౌస్ హోటల్‌లో రెండు వెజ్ బిర్యానీలు కొని, పార్సిల్ తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్లి తింటుండగా ఓ దాంట్లో కేవలం ప్లెయిన్ రైస్, కొన్ని చికెన్ ముక్కలు రావడంతో ఆశ్చర్యానికి గురై జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అప్పుడు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అయితే, జీహెచ్‌ఎంసీ ఫుడ్‌సేఫ్టీ అధికారులు మంగళవారం షాగౌస్ హోటల్‌లో తనిఖీలు చేశారు.

పరిశుభ్రత మెరుగుపర్చుకోవాలని నోటీసు ఇస్తామని తెలిపారు. వెజ్ బిర్యానీలో చికెన్ ముక్కలు రావడం తీవ్రమైన అంశం అని, నోటీసు ఇస్తామనడం ఎంతవరకు సబబు అని వినియోగదారుడు ఫుడ్‌సేప్టీ అధికారి రాజేశ్వరిని ప్రశ్నించగా.. రిపోర్టును డిజిగ్నేటెడ్ అధికారికి సమర్పిస్తామని ఆయన సూచన మేరకు నడుచుకుంటామని తెలిపారు. సుమారు పదిరోజుల తర్వాత తనిఖీలు నిర్వహించడం ఏంటని అడుగగా.. తాను కార్వాన్, గోషామహల్ సర్కిళ్లకు ఇన్‌చార్జిగా ఉన్నానని, తమ వద్ద సిబ్బంది కొరత ఉన్నదని రాజేశ్వరి తెలిపారు.