25-06-2025 02:45:59 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో బుధవారం లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. 8వ వార్డుకు చెందిన పూస పత్రి గోవర్ధన్ కు ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు కాగా దానిని వారి ఇంటికి వెళ్ళి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ వార్డ్ ఇంచార్జ్ షౌకత్ పాషా, మహిళా సభ్యురాలు తార, ఇందిరమ్మ టౌన్ యూత్ మైనార్టీ నాయకులు షేక్ అమీర్, తదితరులు ఉన్నారు.