25-06-2025 02:49:19 PM
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొని చెక్కులను పంపిణీ చేశారు. భద్రాచలం చెందిన గురజాల సత్యవతి కి రూ.18 వేల చెక్కును, కామవరపు వెంకట సుబ్రహ్మణ్యం కు రూ.26 వేల చెక్కును అందజేశారు. అలాగే వెంకటాపురం చెందిన యమన వెంకటేశ్వరరావు కు రూ.60 వేల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ నాయకులు తాళ్లపల్లి రమేష్ గౌడ్, నవాబ్ తో పాటు మండల నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.