23 June, 2026 | 7:58 PM

Breaking News

పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక   •   నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •  

సరైన వైద్యం అందక చిన్నారి మృతి

01-11-2024 10:59 AM

సూర్యాపేట, (విజయక్రాంతి): సమయానికి సరైన వైద్యం అందించడంలో డాక్టర్ నిర్లక్ష్యం వహించడం ద్వారా ఏడేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మద్దిరాల మండలం గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన మొడెం యాకయ్య స్వర్ణలత దంపతుల రెండవ కుమార్తె మొడెం ఉద్ధిజ్ఞ (7) కు జ్వరం రావడంతో గురువారం దీపావళి పండుగ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ పిల్లల ఆసుపత్రికి  తీసుకొచ్చారు.

చిన్నారికి చికిత్స అందించడంలో వైద్యుడు నిర్లక్ష్యం వహించడం ద్వారా తమ చిన్నారి మృతి చెందిందని బాధితులు ఆరోపించారు. తమ చిన్నారి మృతికి కారణమైన వైద్యుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయమై వైద్యుడిని వివరణ కోరగా తాము సరైన సమయానికి వైద్యం అందించమని, చికిత్స అందించే సమయంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని చిన్నారిని మెరుగైన చికిత్స కొరకు వేరొక ఆసుపత్రికి తీసుకొని వెళ్ళాలని సూచించినట్లు తెలిపారు. అయితే తల్లిదండ్రులు వైద్యం అందించాలని కోరారని, అంతలోనే ఈ దురదృష్టకర సంఘటన జరిగిందని వైద్యులు వివరించారు. పోలీసులకు బంధువులకు మధ్య కొంతసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. మృతురాలి తండ్రి యాకయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు.