23-12-2025 04:20:53 PM
జవహర్ నగర్,(విజయక్రాంతి): జవహర్ నగర్ డెంటల్ కాలేజ్ సమీపంలోని మ్యాగీ హైస్కూల్లో క్రిస్మస్ వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మేరీ మాత, శాంతా క్లాజ్ వేషధారణలో పాల్గొన్నారు. విద్యార్థుల నృత్యాలు, నాటక ప్రదర్శనలు, యేసు ప్రభువు కీర్తనలతో పలువురిని ఆకట్టుకున్నాయి.ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్ పాల్గొన్నారు.