15 April, 2026 | 1:15 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

శ్రీ చైతన్య పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు

24-12-2025 06:36 PM

మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణం లక్ష్మీనగర్ శ్రీ చైతన్య పాఠశాలలో బుధ వారం ఘనంగా ప్రీ-క్రిస్మస్ వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ అయూబ్ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. అందరికి సంప్రదాయం, క్రిస్మస్ పండుగ గురించి అవగాహన కల్పించేందుకే ఈ వేడుకలను నిర్వహించామన్నారు. పిల్లలు శాంటా, దేవదూతల వేషాధారణతో అలరించారు. పాఠశాల ఆవరణ అంతా పండుగ వాతావరణం అలుముకుంది. జింగిల్ బెల్ పాటకు విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో ఏజీఎం అరవింద్‌రెడ్డి, కోఆర్డినేటర్లు జయశ్రీ, రోజారాణి, ఇంచార్జిలు అనగమత, పిఇటి కిషన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.