02-02-2026 07:58:40 PM
మఠంపల్లి: అగ్నిఖిలలు చుట్టుముట్టి గూడు కాలిపోయిన ఘటనలో సర్వం కోల్పోయిన దంపతులను ఓదార్చి ఆదుకున్నారు. హుజూర్నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చరమంద రాజు మఠంపల్లి సబ్ ఇన్స్పెక్టర్ బాబుతో కలిసి నిత్యావసర సరుకులు, బియ్యం అందించి మానవత్వం చాటుకున్నారు.
జనవరి 30వ తారీఖున మఠంపల్లి మండలం బక్కమంతులగూడెం గ్రామానికి చెందిన షేక్ ఖాసిం ఆశ దంపతులకు చెందిన గృహం ఫైర్ యాక్సిడెంట్ జరిగి అగ్నిఖిలల్లో ఆహుతైంది. దీంతో గృహంలో ఉన్న కొంత డబ్బు బంగారంతో పాటు సర్వం కాలి బూడిదయ్యాయి. ఈ విషయం పై స్పందించిన సీఐ చరమంద రాజు మఠంపల్లి ఎస్సై బాబుతో కలిసి సోమవారం ఆ దంపతులను కలసి ఓదార్చి నిత్యవసర సరుకులతో పాటు బియ్యం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.