26-06-2025 01:03:47 AM
హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): బోనాల ఉత్సవాలు ప్రారం భం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ర్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలతో రాష్ర్టంలో పండుగ వాతావరణం మొదలవుతుందన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రతిఒక్కరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఈ మేరకు బుధవారం విడుదల చేసిన పత్రికా ప్రకట నలో ఆయన ఆకాంక్షించారు.
చారిత్రాత్మక గోల్కొండలో వెలసిన జగ దాంబిక ఎల్లమ్మతల్లికి ఆషాఢ మాసం తొలి బోనం సమర్పించడంతో జంటనగరాల్లో బోనాల సందడి నెలకొం టుందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురోగ్యాలతో జీవించాలని రాష్ర్టం లో వర్షాలు సమృద్ధిగా కురిసి పంట లు బాగా పండాలని, రాష్ర్టం అన్ని రంగాల్లో పురోగతి సాధించే దిశగా తల్లి దీవెనలు ఉండాలని సీఎం ఆకాంక్షించారు.
జంటనగరాల్లో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ర్ట ప్రభుత్వం ఈ ఏడాది ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు బోనాల ఉత్సవాల ఏర్పాట్లు, భక్తుల సదుపాయాల కోసం రూ.20కోట్ల నిధులు విడుదల చేశామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుం డా చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకో వాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు.