calender_icon.png 27 June, 2025 | 5:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం సహాయనిధి.. పేదలకు వరం

27-06-2025 02:27:54 AM

రాజ్యాంగ పరిరక్షణ సమితి మండల కోఆర్డినేటర్ జీడి వీరస్వామి

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),జూన్26: సీఎం సహాయనిధి పేదలు,నిరుపేద కుటుంబాలకు వరం లాంటిదని రాజ్యాంగ పరిరక్షణ సమితి మండల కో-ఆర్డినేటర్ జీడి వీరస్వామి అన్నారు. మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఆదేశానుసారం గ్రామానికి చెందిన బింగి మహేష్ అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రభుత్వ ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకోగా ఎమ్మెల్యే సహకారంతో ప్రభుత్వం నుండి మంజూరైన రూ.40వేల చెక్కును గురువారం బాధితునికి అందజేసి మాట్లాడారు.

గ్రామ తాజా,మాజీ సర్పంచ్ పాలెల్లి సురేష్,మిల్క్ సొసైటీ మాజీ చైర్మన్ గుడిపెల్లి వెంకట్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు గోలి కోటిరెడ్డి,కొనతం కర్ణాకర్ రెడ్డి, నల్లగుంట్ల నాగేందర్,బింగి బాలరాజు యాదవ్, జితేందర్ రెడ్డి, మోహన్ రెడ్డి, జీడి రవి, బొడ్డు మధు పాల్గొన్నారు.