27-06-2025 02:26:27 AM
రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి
సూర్యాపేట, జూన్ 26 (విజయక్రాంతి) : సూర్యాపేట పట్టణంలోని సద్దల చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దెందుకు ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి సద్దల చెరువును సందర్శించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సద్దల చెరువు ప్రధాన ప్రవేశం వద్ద బతుకమ్మ ఘాట్, బోటింగ్, పిల్లలకి ఆడుకునేందుకు సామాగ్రి,అలాగే జాతీయ రహదారి వద్ద ఉన్న 5 ఎకరాల స్థలంలో ప్రజలకు వినోదం కల్గించేలా పార్క్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు ఏర్పాటు చేయాలనీ అధికారులకి సూచించారు.
ట్యాంక్ బండ్ పై మొక్కలకు పోషణ లేకపోవడం చూసిన చైర్మన్ వెంటనే తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు. పర్యాటక శాఖ అధికారి విద్యాసాగర్, ఆర్డివో వేణుమాధవ్, ఇరిగేషన్, మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.