18 April, 2026 | 3:53 PM

Breaking News

గజాలా హష్మీకి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

05-11-2025 07:20 PM

హైదరాబాద్: అమెరికా స్థానిక ఎన్నికల్లో వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన డెమోక్రటిక్ పార్టీ నాయకురాలు గజాలా హష్మీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌లో జన్మించి అమెరికాలో స్థిరపడిన సెనేటర్ హష్మీ అంతర్జాతీయ వ్యవహారాల్లో డాక్టరేట్ పొందారని గుర్తు చేసుకున్నారు. ఆమె ప్రజా సేవా జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి  ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

భారత సంతతికి చెందిన డెమొక్రాట్ గజాలా హష్మీ వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ రేసులో రిపబ్లికన్ జాన్ రీడ్‌ను ఓడించి గెలిచారు. హష్మీ 15వ సెనెటోరియల్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న వర్జీనియా సెనేట్‌లో పనిచేసిన మొదటి ముస్లిం, దక్షిణాసియా అమెరికన్. ఆమె 2019లో రాజకీయాల్లోకి ప్రవేశించి హష్మీ ఈ  విజయంతో రిపబ్లికన్ పార్టీ ఆధీనంలో ఉన్న రాష్ట్ర సెనేట్ సీటును కైవసం చేసుకుని వర్జీనియా జనరల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.