31-01-2026 07:41:25 PM
సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
జుక్కల్,(విజయక్రాంతి): కెసిఆర్ ను విచారించడం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని అవమానించినట్లు బిఆర్ఎస్ జుక్కల్ మాజీ ఎంపీపీ షెట్కార్ బసవంతరావు అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పోరాటయోధుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ టాపింగ్ కేసు పెడతా సీట్ విచారణకు హాజరు కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నందుకు నిరసనగా సీఎం దిష్టిబొమ్మను దహనం చేసినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బొల్లి గంగాధర్, మాజీ జెడ్పిటిసి పండరి, టిఆర్ఎస్ మండల నాయకులు గూడూరు సర్పంచ్ కాశీనాథ్ అప్ప, శివాజీ పటేల్ రమేష్ పాటిల్, విష్ణు పటేల్, రవి పటేల్, సుధాకర్, రమేష్, మొగులయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. జుక్కల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లి గంగాధర్ గారి ఆధ్వర్యంలో,4 తెలంగాణ రాష్ట్ర పోరాట యోధుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్పై ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో సిట్ విచారణకు హాజరుకావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నందుకు నిరసనగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా జాదవ్ సాయికర్ణ మాట్లాడుతూ, కేసీఆర్ సార్ను విచారించడం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించినట్లేనని అన్నారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ షెట్కర్ బస్వంత్ రావు, మాజీ జడ్పీటీసీ పండరి, గుండూర్ సర్పంచ్ కాశీనాథ్ అప్పా, వసరే రమేష్, విట్టుపటేల్, శివాజీ పటేల్, రవి పటేల్, గజారే రాజు, యువ నాయకులు జి. భాను గౌడ్, సుధాకర్ కౌల్ రమేష్, మొగలయ్య తదితరులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు