6 July, 2026 | 3:29 PM

Breaking News

విజయక్రాంతి వార్తకు స్పందన.. రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

06-07-2026 02:42 PM

హైదరాబాద్: ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. తారామతి బారామతిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. దుర్గంచెరువును పూర్తిస్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. మంజీరా, దిల్ కుషా గెస్ట్ హౌస్ లను ఆధునీకరించాలని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

టూరిజం హబ్ డెవలప్ మెంట్ పథకం(Tourism Hub Development Scheme) కింద వికారాబాద్ ను అభివృద్ధి చేయాలన్నారు. వికారాబాద్ వీరభద్రస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. వీరభద్రస్వామి ఆలయానికి యాదగిరిగుట్ట తరహాలో కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. క్యూర్ పరిధిలోని అటవీశాఖ భూములను ఎకో టూరిజంగా అభివృద్ధి చేయాలని తెలిపారు. గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలో నగరంలోని మరిన్ని పార్కులు, ఫ్యూచర్ సిటీలోని అటవీశాఖ భూములను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.