calender_icon.png 26 October, 2025 | 10:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత..

26-10-2025 08:03:00 PM

లక్షెట్టిపేట్ (విజయక్రాంతి): పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆదివారం స్థానిక మార్కెట్ యార్డ్ లో దండేపల్లి, లక్షెట్టిపేట్ మండలాలకు చెందిన లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ప్రతి బాధితునికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుతున్నాయని తెలిపారు. అనంతరం 95 మంది లబ్దిదారులకు రూ. 29,0,4000ల విలువ గల చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, లక్షెట్టిపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి ప్రేమ్ చంద్, వైస్ చైర్మన్ ఆరీఫ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.