07-06-2025 07:53:10 PM
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..
పటాన్ చెరు: ఆపద కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు ఆపన్న హస్తం అందిస్తోందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) అన్నారు. అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ జయలక్ష్మి నగర్ కాలనీకి చెందిన కె. పున్నయ్య గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో మెరుగైన వైద్య కోసం స్థానిక ఎమ్మెల్యే ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఈ మేరకు వైద్యం కోసం మంజూరైన రూ.2 లక్షల విలువైన ఎల్ఓసి అనుమతి పత్రాన్ని ఎమ్మెల్యే పున్నయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుపేదల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజా పాలన అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జగన్, తదితరులు పాల్గొన్నారు.