07-06-2025 07:57:06 PM
తుంబూరు దయాకర్ రెడ్డి..
ఖమ్మం (విజయక్రాంతి): సంక్షేమమైనా... సహాయమైనా అందించడంలో తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) ముందంజలో ఉంటారని ఆయన క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి(In-charge Tumburu Dayakar Reddy) పేర్కొన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని బారుగూడెం, గొల్లగూడెం, ఏదులాపురం, వరంగల్ క్రాస్ రోడ్డు, మద్దులపల్లి, జలగంనగర్, నాయుడుపేట, కేబీఆర్ నగర్, రాజీవ్ గృహకల్ప, రెడ్డిపల్లి, ముత్తగూడెం ప్రాంతాల్లో ఇటీవల మృతి చెందిన 20 మంది వ్యక్తుల కుటుంబాలను ఓదార్చి పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరుపున ఒక్కో కుటుంబానికి రూ. 10వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు.
ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ... మంత్రిగా ఒకవైపు ప్రభుత్వం తరుపున సంక్షేమ కార్యక్రమాలను ప్రజల దరిచేర్చుతూనే... ఇంకోవైపు తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బాధిత కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నారని పేర్కొన్నారు. రాబోవు రోజుల్లోనూ ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాథబాబు, బాణోతు కిశోర్, భూక్యా సురేష్ నాయక్, బండి జగదీశ్, అజ్మీరా అశోక్ నాయక్, వెంపటి రవి, తమ్మినేని నవీన్, కందుకూరు వెంకట నారాయణ, యాకుబ్, తిప్పిరెడ్డి వీరా రెడ్డి, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మహేశ్, బానోతు దివ్య తదితరులు పాల్గొన్నారు.