17 April, 2026 | 2:44 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి చేయాలి

22-05-2025 12:00 AM

టెలికాన్ఫరెన్స్‌లో కలెక్టర్ క్రాంతి వల్లూరు 

సంగారెడ్డి, మే 21(విజయక్రాంతి): ఈనెల 23న సీఎం పర్యటన ఏర్పాట్లను గురువారంలోగా పూర్తి చేయాలని టెలికాన్ఫరెన్స్ లో  జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు. బుధవారం టెలి కాన్ఫరెన్స్ లో అధికారులతో మాట్లాడుతూ హెలిప్యాడ్ పనులు, ప్రజావేదిక సభ ఏర్పాటు ఎంతవరకు వచ్చాయో అని అడిగి తెలుసుకున్నారు.  హెలిపాడ్ నుండి సభాస్థలి వేదిక వరకు రోడ్డు పనులు పూర్తి చేయాలన్నారు.

వాహనాల పార్కింగ్ పనులు, రూట్ల వారీగా ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రణాళిక వివరాలు, గ్రీనరీ, స్టేజి ఏర్పాట్లు, స్టేజి అలంకరణ, పరిశుభ్రత, మిషన్ భగీరథ తాగునీరు, టాయిలెట్స్, సభకు హాజరయ్యే ప్రజలకు సదుపాయాలు అన్ని గురువారం నాటికి పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, ఆర్డీవోలు, జిల్లా అధికారులు;పాల్గొన్నారు.