కేటీఆర్కు కోడ్ ఎఫెక్ట్
20-05-2024 02:08 AM
చర్యలకు దిగిన ఈసీ
హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు నిబంధనలు ఉల్లంఘించారని ఎన్నికల సంఘం చర్యలకు ఆదేశించింది. పోలింగ్ రోజున తెలంగాణ ఉద్యమ నేతకే ఓటు వేశానని పేర్కొనడంపై ఎన్నికల ఉల్లంఘనగా పేర్కొంటూ ఈసీ చర్యలకు సిద్ధమైంది. ఈ అంశంపై ఇప్పటికే కేటీఆర్కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వాలని గడువు ఇచ్చినా స్పందించక పోవడంతో చర్యలకు ఆదేశించినట్లు తెలుస్తోంది.






