02-07-2025 08:23:30 PM
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు(District Collector Hanumantha Rao) ఆకస్మికంగా సందర్శించి భూభారతి అప్లికేషన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దశరథ, ఎంపీడీవో జితేందర్ రెడ్డి, ఆర్ ఐ నగేష్, సీనియర్ అసిస్టెంట్ మనోహర్ పాల్గొన్నారు.