26-06-2025 06:26:52 PM
జయశంకర్ భూపాలపల్లి/మహబూబాబాద్ (విజయక్రాంతి): భూపాలపల్లి జిల్లాలోని ఈవీఎం, వీవీ ప్యాట్ గోదామును జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma) గురువారం పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, గోదాము నిర్వహణ, సీసీ కెమెరాల పనితీరు, నిరంతర పర్యవేక్షణ తదితర అంశాలను కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు గోదాములో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నామని, అన్ని చర్యలు సక్రమంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈవీఎంల భద్రత విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, పటిష్ట పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అనంతరం తనిఖీ రిజిస్టర్ లో సంతకం చేశారు. ఈ తనిఖీలో ఎన్నికల విభాగం డిటి అబ్బాస్, ఐటి పర్సన్ నవీన్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు మునీందర్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.