4 May, 2026 | 3:17 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

అభివృద్ది పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్ కుమార్ దీపక్

18-07-2025 12:07 AM

భీమారం: భీమారం మండలంలో చేపడుతున్న అభివృద్ది పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. గురువారం మండల కేంద్రంలో నిర్మితమవుతున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి మధుసూదన్ తో కలిసి పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి మూత్రశాలల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, భోజనం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజనం మెనూ, విద్యాబోధన అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల, వసతిగృహాలను సందర్శించి భోజనశాల, ఎనిమిదవ తరగతి గదులను సందర్శించి మరమ్మత్తులకు అవసరమైన ప్రతిపాదనలు సిద్దం చేసి సమర్పించాలని సంబంధిత అధికారులను కోరారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, ఆహారం తయారీ సమయంలో తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యవసర సరుకులు వినియోగించాలని, వంట చేసే వారు శుభ్రత నిబంధనలు పాటించాలని, విద్యార్థులకు శుద్ధమైన త్రాగునీటిని అందించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట సంబంధిత శాఖ అధికారులున్నారు.